బెంగళూరు: కరోనా మహమ్మారి కట్టడి కోసం కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతున్నది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే శని, ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రోజూ నాలుగేసి గంటల చొప్పున కర్ఫ్యూ వేళల్లో సడలింపు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆదివారం కర్ఫ్యూ సడలింపు వేళల్లో కిరాణ దుకాణాలు, ఇతర నిత్యావసర దుకాణాల ముందు జనం బారులు తీరారు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత వెలవెలబోయిన వీధులు ఈ ఉదయం ఒక్కసారిగా కళకళలాడాయి. ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ ఎప్పటిలాగే వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. శివమొగ్గలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో నిత్యావసరాల కోసం జనం రోడ్ల మీదకు వచ్చిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో చూడవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత