Shivpal Yadav | ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివ్పాల్.. యాదవ కమ్యూనిటీ కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతామని పేర్కొన్నారు. యాదవ పునరుజ్జీవన మిషన్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఈ సంస్థకు సంభాల్ మాజీ ఎంపీ డీపీ యాదవ్ అధ్యక్షుడిగా, పోషకుడిగా శివ్పాల్ యాదవ్ కొనసాగనున్నారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా మిషన్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు శివపాల్ యాదవ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
కొత్త సంస్థ చేపట్టబోయే అంశాల్లో కుల గణను నిర్వహించాలనే డిమాండ్తో పాటు అహిర్ (యాదవ్) రెజిమెంట్ను ఏర్పాటు డిమాండ్ ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేనల్లుడు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసిన శివపాల్ యాదవ్.. ఇటీవల మళ్లీ విడిపోయిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు శివపాల్ యాదవ్ 2018లో ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ (లోహియా) పార్టీని స్థాపించారు.