అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ సమాజ్వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్తో ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత శివపాల్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము కచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 300 సీట్లు గెలుచుకొని, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. కాబోయే ముఖ్యమంత్రి అఖిలేశేనని మూడో దశ పోలింగ్ స్పష్టం చేస్తోందన్నారు. అఖిలేశ్ ప్రభంజనాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈఠ్వాలోని జస్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి శివపాల్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.