ముంబై, ఆగస్టు 31: తమతో చేతులు కలిపితే రూ.100 కోట్లు ఇస్తామంటూ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం నుంచి ఆఫర్ వచ్చిందని శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే సునీల్ రౌత్ చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. శివసేన ఎంపీ సంజయ్రౌత్కు సోదరుడైన సునీల్ రౌత్ ఓ వీడియోలో మాట్లాడుతూ బీజేపీ కుట్రలకు తాము తలవంచమని పేర్కొన్నారు.