ముంబై: భారత ఎన్నికల సంఘంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం పంజరంలో చిలుకలా మారిందని, అధికార బీజేపీకి అనుకూలంగా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదని విమర్శించారు. శివసేన పత్రిక సామ్నాలో ఆయన ఈ మేరకు విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయానికి ఉచితంగా టూర్లు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని, ఇది మత ప్రాతిపదికన ప్రచారం చేయడమేనన్నారు. అలాంటి ప్రకటన కాంగ్రెస్ నేత ఎవరైనా చేసుంటే ఈ పాటికి ఈసీ, ఈడీలు వారెంట్తో అతడి ఇంటి ముందు వాలేవన్నారు.