ముంబై, జనవరి 14: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆదివారం విమర్శల దాడి చేశారు. శివసేన, ఎన్సీపీ పార్టీలను చీల్చడం, దొంగిలించడం కాదని, దమ్ముంటే సొంత పార్టీ ప్రారంభించాలని సవాల్ చేశారు.
‘ఒకరు తన మామ పార్టీని, మరొకరు వేరొకరి పార్టీని దొంగిలిస్తారు. వీరికి సొంతంగా పార్టీ పెట్టి, మాపై పోటీకొచ్చే ధైర్యం ఉందా?’ అని షిండే, అజిత్ పవార్లను ప్రశ్నించారు. కాగా, సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై సీఎం షిండే కూడా అదే స్థాయిలో స్పందించారు. తాము బాలాసాహెబ్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని, ఆయన సిద్ధాంతాలకు వదిలేసిన వాళ్లకు తమ గురించి మాట్లాడే హక్కు లేదని కౌంటర్ ఇచ్చారు.