ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. సుమారు 50-100 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ పేర్కొంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ మేరకు బుధవారం స్పష్టత ఇచ్చారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్కు గురువారం వెళ్తున్నట్లు మీడియాతో ఆయన అన్నారు. ఒకవేళ శివసేన యూపీలో పోటీ చేస్తే, మహారాష్ట్ర వెలుపల తొలిసారి పోటీ చేసినట్లవుతుంది.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఇప్పటికే యూపీలో అధికార బీజేపీ, విపక్ష ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. బీఎస్పీ, స్థానిక చిన్న పార్టీలతోపాటు హైదరాబాద్కు చెందిన ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి.
అయితే శివసేన ఎంట్రీతో ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారవచ్చని తెలుస్తున్నది. ముఖ్యంగా బీజేపీ అధిపత్య స్థానాల్లో శివసేన పోటీ చేసే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.