Milind Deora : మహారాష్ట్ర నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా మిలింద్ దియోరను బరిలో నిలపనున్నట్టు శివసేన బుధవారం ప్రకటించింది. నెల కిందట మిలింద్ దియోర కాంగ్రెస్ను వీడి శివసేన (షిండే)లో చేరిన విషయం తెలిసిందే.
తన రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ ప్రస్ధానం ముగిసిన అధ్యాయమని అప్పట్లో మిలింద్ పేర్కొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల సర్ధుబాటు చర్చల పట్ల మిలింద్ అసంతృప్తితో ఆ పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరారని భావిస్తున్నారు.
కాగా బీజేపీ మహారాష్ట్ర నుంచి డాక్టర్ అజిత్ గోప్చాడెను రాజ్యసభ అభ్యర్ధిగా బరిలో నిలిపింది. ఇక 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్ధానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా ఈనెల 15 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.
Read More :
UPSC CSE Notification | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల