చండీఘడ్: ఈ ఏడాది షిమ్లాలో తొలి మంచు(Shimla Snow) కురిసింది. చాలా స్వల్ప స్థాయిలో ఇవాళ ఉదయం షిమ్లా వీధుల్లో మంచు పడింది. దీంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చాన్నాళ్లుగా ఉన్న వర్షాభావ పరిస్థితులు పోయినట్లు భావిస్తున్నారు. స్నోతో నిండిపోతున్న షిమ్లాను తిలకించేందుకు పర్యాటకులు వచ్చేస్తున్నారు. షిమ్లా రిడ్జ్ వద్ద వేల సంఖ్యలో ప్రజలు స్నో ఫాల్ను ఎంజాయ్ చేశారు.
షిమ్లాలోని కుర్ఫీ హిల్ స్టేషన్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆ ప్రాంతం అంతా వింటర్ అందాలతో వండర్ల్యాండ్గా మారింది. హిమాలయాలకు చెందిన ఎగువ ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల్లో తొలిసారి మంచు కురిసింది. పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఆ వెదర్ ఛేంజ్ను ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రాంతీయ వాతావరన కేంద్రం ప్రకారం.. షిమ్లాలో ప్రస్తుతం స్నో ఫాల్ స్వల్ప స్థాయి నుంచి మధ్య స్థాయి వరకు ఉండనున్నది. లాహౌల్-స్పిటి, కిన్నౌర్, చంబా, కులు, కంగ్రా, మండి, సిర్మౌర్, షిమ్లా జిల్లాలో గత 24 గంటల నుంచి మంచు కురుస్తోంది. ఫిబ్రవరి రెండో తేదీన కూడా వెదర్ నార్మల్గా ఉండనున్నది. ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత కాస్త అధికంగా స్నో కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఖారాపత్తర్, టిక్కార్, మందోల్, నార్కండాతో పాటు దొడ్రాకావర్ ప్రాంతాల్లో బుధవారం కూడా స్నో కురిసింది.
Final some light snow ❄️ at Shimla … pic.twitter.com/sSKG2KXTY6
— Abhishek Trivedi (@atrivedi21) February 1, 2024