ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు ఓ కీలక సూచన చేసింది. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే, ముందస్తు జాగ్రత్తల కోసమే ఈ సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో కోరింది.
ఏ సంస్థకైనా, ఎవ్వరికైనా ‘ఫొటోకాపీ ఆధార్’ను ఇవ్వకూడదని, అది దుర్వినియోగం అయ్యే ఛాన్స్ వుందని కేంద్రం హెచ్చరించింది. ఫొటోకాపీకి ప్రత్యామ్నాయంగా మాస్క్డ్ కాపీలను చూపించాలని కేంద్రం సూచించింది. ఈ మాస్క్డ్ కాపీలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయని, దీని ద్వారా ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.