Sharad Yadav | కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తన లోక్తాంత్రిక్ జనతాదళ్ పార్టీకి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో విలీనం చేస్తానని ప్రకటించారు. ఈ నెల 20న ఆర్జేడీలో తన పార్టీ విలీనం జరుగుతుందని బుధవారం పొద్దుపోయిన తర్వాత చెప్పారు. వివిధ జనతాదళ్ గ్రూపులను కలిపే ప్రయత్నంలో భాగంగా ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు.
అనారోగ్య కారణాలతో ఆర్జేడీలో శరద్ యాదవ్ తన పార్టీని విలీనం చేస్తున్నట్లు తెలుస్తున్నది. జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్కుమార్తో విభేదాల తర్వాత శరద్ యాదవ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ మూడున్నర దశాబ్దాలకు పైగా కలిసి రాజకీయాల్లో ఉన్నారు. ఇద్దరూ రాజకీయ చరమాంకంలో ఉన్నట్లు తెలుస్తున్నది.
పశుగ్రాసం కేసుపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా 1997లో జనతాదళ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ విడిపోయి ఆర్జేడీ ఏర్పాటు చేసుకున్నారు. జనతాదళ్లో లాలూను తన శత్రువుగానే శరద్ యాదవ్ పరిగణించారు. 2005లో బీహార్లో ఆర్జేడీ పాలన ముగిసిన తర్వాత యునైటెడ్ జనతాదళ్లో శరద్ యాదవ్ చేరారు.