ముంబై : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్పై గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత శరద్ పవర్ మండిపడ్డారు. గవర్నర్ అన్ని హద్దులు దాటిపోయారని విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్య ప్రకటనలు చేసే వ్యక్తులకు పెద్ద పదవులు సరికాదన్నారు.
ఇటీవల ఔరంగాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ కోష్యారీ మహారాష్ట్రలో శివాజీని పాత రోజుల్లో ఐకాన్గా భావించేవారని, ఇప్పుడు అంబేద్కర్, గడ్కరీని ఐకాన్గా భావిస్తున్నారన్నారు. దీంతో ఆయనపై శివసేనతో పాటు పత్రిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఛత్రపతి శివాజీ ప్రతిష్ఠను చిన్నబుచ్చేలా వ్యాఖ్యానించారని ఎన్సీపీ విమర్శించింది. మహారాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్న కోష్యారీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.