ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ను విందు కోసం తన ఇంటికి ఆహ్వానించారు. ఈ మేరకు వారికి ఆహ్వానాలు పంపి అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్చి 2న పూణే జిల్లా బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ కాలేజీ ప్రాంగణంలో జాబ్ మేళా జరుగనున్నది. ‘నమో మహారోజ్గర్ మేళవా’ కార్యక్రమానికి సీఎం షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర మంత్రులు హాజరుకానున్నారు.
కాగా, పార్లమెంట్ సభ్యులమైన తాను, తన కుమార్తె సుప్రియా సూలే ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకుంటున్నట్లు సీఎం షిండేకు రాసిన లేఖలో శరద్ పవార్ పేర్కొన్నారు. విద్యా ప్రతిష్ఠాన్ అధ్యక్షుడిగా ఆ విద్యా సంస్థ ఆవరణలో సీఎంకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. అలాగే కార్యక్రమం తర్వాత బారామతిలోని తన నివాసంలో విందు ఆహ్వానాన్ని అంగీకరించాలని సీఎం షిండ్తో పాటు ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర మంత్రులను ఆ లేఖ ద్వారా కోరారు.
మరోవైపు ఎన్సీపీకి కంచుకోట అయిన బారామతి ఎంపీ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గత కొన్నేళ్లుగా పోటీ చేసి గెలుస్తున్నారు. అయితే ఈసారి ఆ స్థానం నుంచి తన భార్యను పోటీకి దించాలని ఎన్సీపీలో తిరుగుబాటు చేసి షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ యోచిస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా ఆయన వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ ఈ లేఖ ద్వారా విందు రాజకీయానికి ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాగా, బిజీ కార్యక్రమాల వల్ల శరద్ పవార్ విందుకు రాలేకపోతున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు శరద్ పవార్కు ఆయన లేఖ రాశారు.
NCP, SCP Chief Sharad Pawar extended an invitation to Chief Minister Eknath Shinde and both Deputy CMs Ajit Pawar and Devendra Fadnavis for lunch at his Baramati residence on 2nd March.
The letter reads. "After taking oath as CM of the state, the CM is coming to Baramati for… pic.twitter.com/oIvLpyrznu
— ANI (@ANI) February 29, 2024