అహ్మదాబాద్: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని అహ్మదాబాద్లో కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలో మొట్టమొదటి ల్యాక్టోఫెర్రిన్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో వీరిద్దరూ కలిశారు. అనంతరం శరద్ పవార్ అహ్మదాబాద్లోని అదానీ ఇంటికి, కార్యాలయానికి వెళ్లి ఆయనతో చర్చించారు. అనంతరం అదానీని అభినందిస్తూ ఎక్స్లో పోస్టు చేశారు. కాగా, ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న శరద్ పవార్ అదానీని కలవడాన్ని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం.