Madhya Pradesh | భోపాల్ : అంబులెన్స్కు డబ్బులు చెల్లించే స్తోమత లేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ తండ్రి తన కూతురి మృతదేహాన్ని కొన్ని కిలోమీటర్ల మేర బైక్పైనే తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలోని కోట గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్ గౌడ్ కుమార్తె మాధురి గౌడ్ మే 12వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను అదే రోజు షాదోల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సికెల్ సెల్ రోగంతో బాధపడుతున్న మాధురి రెండు రోజుల చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయింది. డెడ్బాడీని కోట గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చాలని ఆస్పత్రి వైద్యులకు ఆమె కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కానీ అంబులెన్స్ను సమకూర్చలేదు. 15 కిలోమీటర్ల వరకు మాత్రమే అంబులెన్స్ను సమకూర్చుతామని, 70 కిలోమీటర్ల వరకు కష్టం అని చెప్పారు.
దీంతో చేసేదేమీ లేక లక్ష్మణ్ సింగ్ తన కుమార్తె మృతదేహాన్ని బంధువు సహాయంతో బైక్పైనే తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియోపై జిల్లా కలెక్టర్ వందన వైద్య క్షణాల్లో స్పందించారు. లక్ష్మణ్ సింగ్ను మార్గమధ్యలోనే ఆపారు. జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ జీఎస్ పరిహార్కు ఫోన్ చేసి, అంబులెన్స్ సమకూర్చాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్ సమకూర్చి, మాధురి డెడ్బాడీని స్వగ్రామానికి తరలించారు. ఆ కుటుంబానికి కలెక్టర్ ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు.
MP | Shahdol
लक्षमण सिंह गोंड (आदिवासी) की 13 साल की बेटी माधुरी की सिकल सेल बीमारी से मौत हो गई।
एंबुलेंस मांगने पर अस्पताल में कहा: अनुमति 15 किमी तक की है 70 किमी के लिए अपना इंतज़ाम करो।
प्राइवेट एंबुलेंस बजट में नहीं था तो लक्षमण बेटी का शव बाइक पर लेकर चल पड़े।
1/2 pic.twitter.com/aFDBp4DgLu
— काश/if Kakvi (@KashifKakvi) May 16, 2023