బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి బ్యాగేజీలో 72 అరుదైన పాములు, ఆరు చనిపోయిన కోతులను గుర్తించారు. కోతుల కళేబరాలను తగు జాగ్రత్తలతో డిస్పోజ్ చేశారు. పాములను వాటివాటి ఆవాస దేశాలకు పంపించారు. నిందితునిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుడు బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఏషియా విమానంలో ఈ అరుదైన వన్య ప్రాణులను అక్రమంగా బెంగళూరుకు తీసుకొచ్చాడని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అతడి బ్యాగేజీలో 72 అరుదైన పాములు ఉన్నాయని, వాటిలో 55 బాల్ పైథాన్లు, 17 కింగ్ కోబ్రాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఆరుదైన జాతికి చెందిన ఆరు కోతులు మాత్రం చనిపోయి ఉన్నాయన్నారు.