Road accident : బంధుమిత్రులను తీసుకుని ఓ వివాహ వేడుకకు వెళ్తున్న పెండ్లి బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలోని తార్కుండిలో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు, రాష్ట్రీయ్ రైఫిల్స్కు క్యాంప్కు చెందిన జవాన్లు ఘటన ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.