న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విలయం సృష్టిస్తున్నది. ఇప్పటి వరకు ఐదు కేసులు దేశంలో నమోదవగా.. ఇవాళ ఒకే రోజు మహారాష్ట్రలో ఏడు కేసులు రికార్డయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఒక కేసు నమోదవగా.. వీటితో మొత్తం సంఖ్య ఎనిమిదికి చేరింది. ఒకే రోజు ఏడుగురికి వైరస్ పాజిటివ్గా తేలడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఈ మేరకు మహారాష్ట్ర ప్రజారోగ్య శాఖ కేసుల వివరాలను ఆదివారం ప్రకటించింది. ఏడుగురు మహారాష్ట్రలోని పుణెకు చెందిన వారుగా తెలుస్తున్నది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం సంఖ్య 12కు పెరిగింది. ఇంతకు ముందు బెంగళూరులో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, గుజరాత్లోని జామ్నగర్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది.