New Parliament | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది! పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సమావేశాల్ని మార్చే ప్రక్రియను గణేశ్ చతుర్థి రోజు చేపట్టాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలోనే మొదలవుతాయని, మరుసటి రోజు (సెప్టెంబర్ 19) నుంచి కొత్త భవనంలో నిర్వహించనున్నారని బుధవారం వార్తలు వెలువడ్డాయి.