దేశంలో మంకీపాక్స్ కేసుల నేపథ్యంలో సీరం చీఫ్ అదర్ పునావాలా వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 26: దేశంలో మంకీపాక్స్ కేసుల నమోదు ఆందోళనల నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ అదర్ పూనావాలా స్పందించారు. దేశంలో ఈ వైరస్ కేసులు అధికమైతే..డెన్మార్క్కు బవేరియన్ నోర్డిక్ కంపెనీ తయారుచేసిన మశూచి(స్మాల్పాక్స్) వ్యాక్సిన్ కొన్ని లక్షల డోసులు దిగుమతి చేసుకునేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని మంగళవారం పేర్కొన్నారు.
మంకీపాక్స్ చికిత్సకు ఈ మశూచి వ్యాక్సిన్ కూడా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ డోసుల కొనుగోలుకు సొంత నిధులు వెచ్చిస్తామని తెలిపారు. ఈ మేరకు తయారీదారు కంపెనీతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. అయితే వ్యాక్సిన్ల నిల్వ అంశంతో పాటు హెల్త్ పాలసీపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మరోవైపు కొవిడ్ నుంచి నిఫా, మంకీపాక్స్ వరకు దేశంలో తొలి కేసు కేరళలోనే నమోదైన విషయం తెలిసిందే.