జకర్తా : ఇండోనేషియాలో సెరోజా తుఫాన్ బీభత్సం సృష్టించింది. తూర్పు న్యూసా తెంగ్గారా ప్రావిన్స్లో మృతుల సంఖ్య 177కు చేరింది. వందల మంది గల్లంతయ్యారు.
కొండచరియలు విరిగిపడటంతో చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయని అధికారులు తెలిపారు.
కుపాంగ్ జిల్లాలో చాలా గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. బాధితులకు ఆహారం, నీరు, ఇతర సామగ్రి సరఫరా చేసేందుకు రెండు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ జోసెఫ్ నియో సోయ్ తెలిపారు.
తుపాన్ కారణంగా తూర్పు ఫోరెస్లో 72 మంది, లేంబాటలో 47 మంది, అలోర్లో 28 మంది, న్యూసా తెంగ్గారా ప్రావిన్స్ రాజధాని కుపాంగ్లో ఆరుగురు చనిపోయారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అద్దె గృహాల్లో ఉంటున్న వారిని ఇప్పటికే సహాయక శిబిరాలకు తరలించామని, శిబిరాల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
సెరోజ్ తుపాన్ కారణంగా న్యూసా తెంగ్గారా ప్రావిన్స్లోని తూర్పు, దక్షిణా ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని, సావు సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముంది.
సముద్ర కెరటాలు 6 మీటర్ల మేర ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి