Senthil Balaji | మనీలాండరింగ్ కేసులతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అర్ధరాత్రి విద్యుత్ మంత్రిగా పని చేస్తున్న వి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది. గంటల పాటు విచారించిన అధికారి చివరకు ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తమిళనాడు సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సహా చెన్నైలోని ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆ తర్వాత మంత్రిని సుదీర్ఘంగా మంత్రిని ప్రశ్నించిన అధికారులు.. అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సెషన్స్కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. మరో వైపు సెంథిల్ బాలాజీ అరెస్ట్పై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార బీజేపీ ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సెంథిల్ బాలాజీ అరెస్టును తప్పుపట్టారు.