చెన్నై: తమిళనాడు మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి ఇవాళ బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. మద్రాసు హైకోర్టుకు వ్యతిరేకంగా ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ ఉదయం కావేరి ఆస్పత్రిలో బాలాజీకి సర్జరీ నిర్వహించారు. సీఎం స్టాలిన్ బృందం నుంచి సెంథిల్ను తొలగించాలని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు ప్రదర్శన చేపట్టాయి. మంత్రి బాలాజీకి బీటింగ్ హార్ట్ కరోనరీ ఆర్టెరీ సర్జరీ చేశారు. కావేరీ హాస్పిటల్ ఇవాళ ఉదయం ఆ ప్రకటన చేసింది. నాలుగు బైపాస్ గ్రాఫ్ట్లను పొందుపరిచామని కావేరీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు.