చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మరి ఉధృతి ఇంకా కొనసాగుతున్నది. రోజూ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా కొత్తగా 22,651 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,95,402కు చేరింది. ఇక ఇవాళ కొత్తగా 263 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దాంతో మొత్తం కరోనా మరణాలు సంఖ్య 26,128కి చేరింది.
ఇక కొత్తగా శుక్రవారం కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 33,646. దాంతో మొత్తం డిశ్చార్జిల సంఖ్య 19,00,306కు పెరిగింది. ఇక ప్రస్తుతం తమిళనాడులో 2,68,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి.