P. Chidambaram | న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాల గురించి సీనియర్ కాంగ్రెస్ నేతలు గట్టిగా విశ్వాసం వ్యక్తం చేయలేకపోతున్నారు.
ఓ మీడియా సంస్థ శుక్రవారం నిర్వహించిన కాంక్లేవ్లో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం మాట్లాడుతూ, “కాంగ్రెస్ గెలిచే స్థానాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోతాయా? అంటే, అది నేను చెప్పలేని విషయం” అని తెలిపారు.