Union Budget 2023-24 | ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉండగా.. దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
మరోవైపు మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (Mahila Samman Saving Certificate) అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ పథకం రెండేళ్ల వరకు అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు. ఇందులో రూ.రెండు లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్పై 7.5 శాతం వడ్డీ ఉంటుంది.