న్యూఢిల్లీ, ఆగస్టు 8: ముస్లింలను చంపండి.. బహిష్కరించండని కొన్ని సంఘాలు, వ్యక్తులు చేస్తున్న విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలని సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా మత ఘర్షణలు జరిగిన హర్యానాతోపాటు వివిధ రాష్ర్టాల్లో జరిగిన ర్యాలీల్లో పోలీసుల సమక్షంలోనే ఈ దారుణాలు జరుగుతున్నాయని ఆయన సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. 370 అధికరణపై విచారణ జరుగుతున్న సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.