అహ్మదాబాద్, సెప్టెంబర్ 4: మూడేండ్ల లోపు తమ పిల్లల్ని బలవంతంగా ప్రీస్కూల్స్కు పంపితే.. అది నేరపూరిత చర్య కిందకే వస్తుందని గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 1వ తేదీ నాటికి మూడేండ్లు దాటని పిల్లల్ని ప్రీస్కూల్స్ ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది.
మొదటి తరగతి అడ్మిషన్కు పిల్లల కనీస వయసు ఆరేండ్లుగా పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ జారీచేసింది. దీనిని సవాల్ చేస్తూ కొంతమంది తల్లిదండ్రులు జనవరి, 2023లో హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.