న్యూఢిల్లీ : రూ 1034 కోట్ల భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ మంగళవారం అటాచ్ చేసింది. రౌత్కు చెందిన అలీబాగ్ ప్లాట్, ముంబైలోని దాదర్లో ఒక ఫ్లాట్ సహా పలు ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ అటాచ్ చేసింది.
ఈడీ చర్యల అనంతరం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ తన ఆస్తులను సీజ్ చేసినా తనను చంపినా, జైలుకు పంపినా తాను భయపడేది లేదని అన్నారు. సంజయ్ రౌత్ బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడని, శివసైనికుడని స్పష్టం చేశారు. అందరి బాగోతం తాను బయటపెడతానని, తాను మౌనంగా చూస్తూ కూర్చోనని..వీళ్ల ఆగడాలు అంతమై వాస్తవాలు బయటకు వస్తాయని రౌత్ ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేందుకు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు, బీజేపీతో కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. ఈ ఏడాది జరిగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో ఈ పరిణామాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.