ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండేకు గాలం వేసి తిరుగుబాటు చేసేలా చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్నాథ్ షిండే అని ప్రకటించారు. రాత్రి 7.30 గంటలకు ఏక్నాథ్ షిండే ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. షిండే ప్రభుత్వంలో తాను భాగంగా ఉండనని అన్నారు. అయితే షిండే ప్రభుత్వానికి బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తుందన్నారు. అలాగే మంత్రి వర్గ విస్తరణలో శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతోపాటు, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉంటారని వెల్లడించారు.
మరోవైపు వారం పాటు గౌహతిలో ఉండి బుధవారం అక్కడి నుంచి గోవాలోని హోటల్కు మకాం మార్చిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఏక్నాథ్ షిండేను సీఎంగా ప్రకటించడంతో సంతోషంతో డ్యాన్సులు వేశారు. షిండే సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు కానుడటంతో ఆనందం పట్టలేకపోతున్నారు.
కాగా, 39 మంది శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలను కూడగట్టి వారం రోజులుగా క్యాంప్ చేసిన ఏక్నాథ్ షిండే మాత్రమే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబైకి తిరిగివచ్చారు. అనంతరం నేరుగా ఫడ్నవీస్ ఇంటికి వెళ్లారు. ఆయనతో కలిసి రాజభవన్కు వెళ్లి మహారాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు గురించి ప్రకటించారు.
#WATCH | Eknath Shinde-faction MLAs, staying at a hotel in Goa, celebrate following his name being announced as the Chief Minister of Maharashtra. pic.twitter.com/uJVNa4N74g
— ANI (@ANI) June 30, 2022