ముంబై: భారత రాజ్యాంగాన్ని వలసవాదులు ఇవ్వలేదని, మనమే తయారు చేసుకొన్న స్వదేశీ ఉత్పత్తి అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. స్వయంపాలన, గౌర వం, స్వాతంత్య్రాన్ని కల్పించే స్వదేశీ ప్రొడక్ట్ భారత రాజ్యాంగం అని తెలిపారు. నాగ్పూర్లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ శనివారం నిర్వహించిన మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బలమైన రాజ్యాంగంతో సమాజం కొంత పురోగతి సాధించినా.. నేటికీ అసమానతలు ఉన్నాయని పేర్కొన్నారు.