న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 5వ తేదీన ఈ అంశంపై తుది వాదనలు వింటామని, వచ్చే మంగళవారం నాటికి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ఆ రోజు వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పింది.