న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి జైశంకర్కు కేంద్ర హోం శాఖ భద్రతను పెంచిం ది. ప్రస్తుతం ఆయనకు ‘వై’ క్యాటగిరీ కింద ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దీన్ని ‘జెడ్’ క్యాటగిరీకి పెంచిన ట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనకు భద్రత కల్పించే బాధ్యతలను స్వీకరించాలని కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్)ను కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు తెలుస్తున్నది. దీంతో ఇకపై ఆయనకు నిరంతరం 14-15 మంది సాయు ధ కమాండోలు భద్రత కల్పిస్తారు.