జమ్ము, జూలై 17: వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో చొరబడటానికి యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది శవం ఆర్మీకి లభించగా.. మరో ఉగ్రవాది మృతదేహం పూంఛ్ నదిలో కొట్టుకుపోయింది. ఆయుధాలను కూడా సైన్యం స్వాధీనం చేసుకుంది.
మరోవైపు ఉగ్రవాదులకు సహకరించారనే కారణంతో విచారణ లేకుండా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర భద్రతకు ముప్పుగా పరిణమించారని భావిస్తూ కశ్మీర్ విశ్వ విద్యాలయ ప్రజా సంబంధాల అధికారిని, ఒక రెవెన్యూ శాఖ అధికారిని, ఒక కానిస్టేబుల్ను తొలగిస్తున్నట్టు తెలిపింది.