మల్కాన్గిరి : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో పోలీసులు శుక్రవారం సాయంత్రం కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్లో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సరిహద్దులో ఓ బ్యాగు స్థానికుల కంటపడింది. ఆ బ్యాగ్ నిండా పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.
దీంతో అక్కడ కూంబింగ్ చేపట్టి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్లో నాలుగు టిఫిన్ బాంబులు, 20 వెబ్ బెల్ట్స్, 19 జంగిల్ క్యాప్, మెడిసిన్స్ ఉన్నాయి. ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో నెల రోజుల వ్యవధిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ఇది మూడోసారి.