బెంగళూరు, మే 26: ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరుతో కర్ణాటక సర్కారు సెక్రటేరియట్లో కొంత మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు శుక్రవారం ‘సెక్రటేరియట్ బంద్’ నిర్వహించారు. శుక్రవారం విధులకు హాజరు కాలేదు. ఈ బంద్ చట్టవిరుద్ధమైనదని ప్రభుత్వం పేర్కొన్నది. ఉద్యోగులందరూ విధులకు హాజరు కావాలని ఆదేశించింది. గైర్హాజరైతే జీతాలు చెల్లించబోమని, క్రమ శిక్షణ చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. కర్ణాటక సెక్రటేరియట్లో దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.