న్యూఢిల్లీ: మలి విడుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాం తంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న సమయంలోనే నెల రోజులు కొనసాగే పార్లమెంటు సమావేశాలు కూడా మొదలవుతుండటం గమనార్హం. ఆర్థిక బిల్లుతో పాటు 2021-22 సంవత్సరానికి వివిధ గ్రాంట్ల డిమాండ్లకు ఆమోదం పొందడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం. ఏప్రిల్ 8 వరకు కొనసాగే సమావేశాల్లో పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు మరో ఇరవై రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్ని కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది.