అయోధ్య: అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించనున్న రాముడి విగ్రహాన్ని చెక్కింది శిల్పి యోగిరాజ్ అరుణ్. కర్నాటకలోని మైసూరుకు చెందిన ఈ శిల్పి చెక్కిన అయిదేళ్ల బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం ఎంపిక కావడం వల్ల అతని ఫ్యామిలీ సభ్యులు సంతోషంలో ఉన్నారు.
#WATCH | Mysuru, Karnataka: Visuals from the residence of sculptor Arun Yogiraj.
The idol of Lord Rama, carved by Arun Yogiraj will be installed in Ayodhya Ram Temple. pic.twitter.com/se3EwfKszW
— ANI (@ANI) January 2, 2024
కృష్ణశిలపై శిల్పి యోగిరాజ్ అయిదేళ్ల బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు. కర్నాటకలోని కారకల ప్రాంతం నుంచి ఆ కృష్ణశిలను అతను తీసుకువచ్చాడు. గత ఏడాది మార్చిలో రామ్ లల్లా విగ్రహం తయారీ కోసం ఈ రాయిని ఎంపిక చేశారు. తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉందని అరుణ్ తల్లి సరస్వతి అన్నారు. అరుణ్ శిల్పం చెక్కడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నా, కానీ చివరి రోజు తన పని వద్దకు తీసుకువెళ్తానని చెప్పాడని, శిల్పం ప్రతిష్టించిన రోజు వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. అరుణ్ తండ్రి బ్రతికి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారని ఆమె అన్నారు. తన కుమారుడు చెక్కిన రాముడి శిల్పాన్ని ప్రపంచం అంతా చూస్తుందని, ఇంతకన్నా తనకు సంతోషం ఏముంటుందని సరస్వతి తెలిపారు.
శిల్పి యోగిరాజ్ భార్య పేరు విజేత. తన భర్త పట్ల గర్వంగా ఉందని ఆమె అన్నారు. తనకు మాటలు రావడం లేదని, సంతోషంగా ఫీలవుతున్నానని, గర్వంగా కూడా ఉందని అన్నారు. రామ్ లల్లాను చెక్కిన విషయాన్ని తన భర్త తనకు చెప్పలేదని, మీడియా ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అసలు ఈ వార్త నిజమా అబద్దామా అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. ఫోన్ చేసి తన భర్త నుంచి విషయం తెలుసుకున్నానని ఆమె అన్నారు. వర్క్ విషయంలో మాత్రం అరుణ్ ఎప్పుడూ కాంప్రమైజ్ కారన్నారు. ఏ పని చేసినా వంద శాతం వర్క్ చేస్తారన్నారు. రీసర్చ్ చేసి పూర్తిగా తన సమయాన్ని కేటాయిస్తారన్నారు.
Mysuru, Karnataka: On the selection of idols carved by sculptor Arun Yogiraj for installation in Ayodhya’s Ram Temple, Yogiraj’s mother Saraswathi says, “It is the happiest moment for us, I wanted to see him crafting the sculpture, but he said he would take me on the last day, I… pic.twitter.com/TMXaDAwp7r
— ANI (@ANI) January 2, 2024
రాముడి విగ్రహం ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. డిసెంబర్ 30వ తేదీన ఆ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రకు చెందిన బోర్డు ట్రస్టీలు రామ్ లల్లా విగ్రహాలను పరిశీలించారు. పోటీలో ఉన్న మూడు విగ్రహాలను పరిశీలించి తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా ట్రస్టుకు సమర్పించారు. కర్నాటక నుంచే మరో శిల్పి గణేశ్ భట్, రాజస్థాన్ నుంచి సత్యనారాయణ్ పాండేలు కూడా పోటీపడ్డారు. కర్నాటక శిల్పులు కృష్ణశిలను వాడగా, రాజస్థాన్ శిల్పి మాత్రం మక్రానా వైట్ మార్బుల్ను వాడారు. ముంబైకి చెందిన ఆర్టిస్టు వసుదేవ్ కామత్ ఇచ్చిన స్కెచ్ల ఆధారంగా రామ్ లల్లాను డిజైన్ చేశారు. కర్నాటక శిల్పి వరున్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని ప్రాణ ప్రతిష్టకు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
“ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು”
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q
— Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024