న్యూఢిల్లీ, జూన్ 23: ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చాలని బాలీవుడ్ నటి కంగన రనౌత్ సూచించారు. ఇండియా అనే పేరును బ్రిటీష్వాళ్లు పెట్టారని, ఈ బానిస పేరు మనకొద్దని ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా దేశానికి భారత్ అనే పేరు ఉన్నదని, ఈ పేరును తిరిగి పెట్టాలని కోరారు.