న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పాత వాహనాలను తుక్కుగా మార్చే విధానానికి బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించామని నిర్మల చెప్పారు. ఇందుకోసం సరిపడా నిధులు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ విధానం వల్ల కొత్త వాహనాల ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు.
15 ఏండ్లకుపైబడిన దాదాపు 9 లక్షల ప్రభుత్వ వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రూ.2,200 కోట్లతో ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నట్టు నిర్మల వెల్లడించారు.