Schools Closed | శీతాకాల నేపథ్యంలో తీవ్రమైన చలి నేపథ్యంలో అధికారులు పాఠశాలలకు సెలవులను పొడిగించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్ బుద్ధనగర్లో నర్సీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలలు ఈ నెల 14 వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు డిసెంబర్ 6 వరకు పాఠశాలలు మూసివేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ప్రస్తుతం తీవ్రమైన చలి కొనసాగుతుండడంతో సెలవులను పొడిగించాలని నిర్ణయించారు.
కలెక్టర్ ఆదేశాల మేరు జిల్లాలోని అన్ని బోర్డు గుర్తింపు పొందిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పిల్లలకు జనవరి 14 వరకు సెలవులు ఉంటాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో చలిగాలుల విధ్వంసం కొనసాగుతోంది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో చలిగాలులు, పొగమంచు దట్టంగా కురుస్తున్నది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. రోడ్డుపై వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. అలాగే, విమానాలపై సైతం ప్రభావం పడుతున్నది.