ముంబై: మహారాష్ట్రలో స్కూళ్లను సోమవారం నుంచి తెరవనున్నారు. ముంబై మహానగరంలోనూ పాఠశాలలను సోమవారం నుంచి తెరవనున్నట్లు మంత్రి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు జనవరి 24వ తేదీ నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. తమ ప్రతిపాదనకు సీఎం అంగీకరించినట్లు మంత్రి చెప్పారు. తొలుత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. డిసెంబర్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గుతోందని, అందుకే నిపుణుల సూచన మేరకు స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. స్కూళ్ల ఓపెనింగ్పై స్థానిక అధికారులకే అవకాశం ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. మున్సిపల్ కమీషనర్లు, జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, విద్యాధికారులు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.