లక్నో: స్కూల్ విద్యార్థిని ఒక కారు ఢీకొట్టింది. విద్యార్థి కాలు వెనుక చక్రం వద్ద ఇరుక్కోవడంతో కిలోమీటరు దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కారు ఆపాలని డ్రైవర్కు చెప్పినా అతడు పట్టించుకోలేదు. చివరకు రద్దీ ప్రాంతంలో ఆ కారును జనం అడ్డుకుని విద్యార్థిని కాపాడారు. 15 ఏళ్ల బాలుడ్ని ఢీకొట్టి ఆపకుండా కారుతో ఈడ్చుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రైవర్ను చితక్కొట్టారు. ఆ కారును ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఈ సంఘటన జరిగింది.
శుక్రవారం సాయంత్రం 9వ తరగతి చదువుతున్న కేతన్ కుమార్ సైకిల్పై ట్యూషన్కు వెళ్తున్నాడు. తెల్లని వ్యాగనార్ అతడి సైకిల్పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆ విద్యార్థి కాలు కారు వెనుక చక్రం భాగంలో ఇరుక్కున్నది. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపలేదు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా డ్రైవ్ చేయగా ఆ బాలుడ్ని అది ఈడ్చుకెళ్లింది.
మరోవైపు గమనించిన స్థానికులు కారు ఆపాలని కేకలు వేస్తూ దాని వెంటపడ్డారు. అయినప్పటికీ డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపకపోగా వీధుల్లో వేగంగా నడిపాడు. అయితే జనం రద్దీగా ఉండే చోట ఆ కారును కొందరు అడ్డుకున్నారు. ఆ డ్రైవర్ను కర్రలతో చితక్కొట్టారు. కారును ఒకవైపు తోసి ధ్వంసం చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు జనం బారి నుంచి డ్రైవర్ను కాపాడి అరెస్ట్ చేశారు. గాయపడిన విద్యార్థి కేతన్ కుమార్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఢిల్లీ తరహాలో జరిగిన ఈ సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
NEW INDIA means car-dragging incidents or Urinating on Air India flights #AcheDin
Below video is of 15 year old dragged 1 km by a Sanskari car in Hardoi, UP #KanjhawalaDeathCase pic.twitter.com/g12hfnQzCn
— Superman (@superman19239) January 6, 2023