న్యూఢిల్లీ: పరీక్షలను పరిశీలించేందుకు వచ్చిన టీచర్ను ఒక విద్యార్థి కత్తితో పొడిచాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఇందర్పురి ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్లో గురువారం ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలను పర్యవేక్షించేందుకు భూదేవ్ అనే ఉపాధ్యాయుడు ఆ స్కూల్కు వచ్చాడు. అయితే 12వ తరగతి చదివే విద్యార్థి కత్తితో ఆ టీచర్పై దాడి చేశాడు. అతడ్ని పలుమార్లు కత్తితో పొడిచాడు. దీంతో టీచర్ భూదేవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను వెంటనే బీఎల్కే కపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఉపాధ్యాయుడు భూదేవ్ను కత్తితో పొడిచిన 12వ తరగతి విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నారు. టీచర్ పై దాడిలో మరో ఇద్దరు విద్యార్థుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.