లక్నో: ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్పై వెళ్తున్న యువతి చున్నీని ఒక యువకుడు లాగాడు. ఆమె సైకిల్ అదుపుతప్పడంతో రెండు బైకులు ఢీకొట్టాయి. (School girl On Bicycle Run Over By Bike) తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని చనిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్లో ఈ సంఘటన జరిగింది. వారాహి గ్రామానికి చెందిన 17 ఏండ్ల నైన్సీ పటేల్, హీరాపూర్ బజార్లోని రాంరాజీ కాలేజీలో ఇంటర్ చదువుతున్నది.
కాగా, శుక్రవారం కాలేజీ ముగిసిన తర్వాత ఆ విద్యార్థిని సైకిల్పై ఇంటికి వెళ్తున్నది. కొందరు ఆకతాయిలు రెండు బైకులపై ఆ యువతిని వెంబడించారు. ఒక బైక్ వెనుక కూర్చొన యువకుడు నైన్సీ చున్నీ లాగాడు. దీంతో ఆమె సైకిల్ అదుపుతప్పింది. వెనుక వస్తున్న మరో బైక్తోపాటు ఎదురుగా వచ్చిన బైక్ ఆమె సైకిల్ను ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై పడిన ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువతి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు నైన్సీ పటేల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు తమ కుమార్తె వెంటపడి వేధించడంతోపాటు ఆమె ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిందితులైన షావాజ్, అర్బాజ్తోపాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी के अम्बेडकरनगर में शर्मनाक वारदात। स्कूल की छुट्टी के बाद साइकिल से घर जा रही छात्रा का दुपट्टा बाइक सवार युवकों ने खींचा। दुपट्टा खीचने से सड़क पर गिरी छात्रा। पीछे से आई बाइक ने छात्रा के सिर पर चढ़ाई गाड़ी। छात्रा की हुई मौत। सम्प्रदाय विशेष से जुड़े आरोपी पहले भी स्कूल… pic.twitter.com/VfZTUMBf7o
— SANJAY TRIPATHI (@sanjayjourno) September 16, 2023