Accident | పంజాబ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తర్న్ తరణ్ జిల్లాలోని షేక్చక్ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు పాఠశాల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#BreakingNews | HORRIFYING ACCIDENT IN PUNJAB
Two children, including the school bus driver, were killed and other children injured in a horrific accident near Shekhchak village in Tarn Taran district in the early hours today
Gurpreet Singh reports#PUNJAB #Punjabaccident pic.twitter.com/tYNNVCthiQ
— Mirror Now (@MirrorNow) December 3, 2022