Loksabha Elections | న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫోటోల మార్పునకు అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి 2024, జనవరి 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 2024, జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. జనవరి 8వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024, జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.