భోపాల్ : ఓ గర్భిణికి స్కానింగ్ చేస్తే కవల పిల్లలు ఉన్నారని తేలింది. కానీ ఆమె ప్రసవించిన తర్వాత కవలలు లేరు. రెండు తలలు, మూడు చేతులతో కూడిన శిశువును ఆమె ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాట్లం జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ మహిళ నిండు గర్భిణి. ప్రసవానికి ముందు ఆమెకు స్కానింగ్ చేశారు వైద్యులు. కవల పిల్లలు ఉన్నారని డాక్టర్లు తెలిపారు. నెలలు నిండటంతో ఆమె ఇటీవలే ప్రసవించింది. కానీ కవల పిల్లలు జన్మించలేదు. రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లతో కూడిన బిడ్డ జన్మించింది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం ఇండోర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బ్రజేష్ లహోటీ మాట్లాడుతూ.. స్కానింగ్లో కవలలుగా గుర్తించినప్పటికీ అలా జరగలేదని తెలిపారు. ఇలాంటి ఘటన అరుదుగా జరుగుతుందన్నారు. ప్రస్తుతం బేబీకి పీడియాట్రిక్ ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయితే బిడ్డ పరిస్థితి క్రిటికల్గా ఉందన్నారు. ఇలాంటి శిశువు ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ బిడ్డకు ఒకే కడుపు ఉన్నప్పటికీ, రెండు వెన్నెముకలు ఉన్నాయి. మూడు కిలోల బరువు ఉందన్నారు.