న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద వలస రాజ్యాల కాలం నాటి రాజద్రోహ చట్టం రాజ్యాం గ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఈనెల 12న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో ఐపీసీ కింద పూర్వకాలం నుంచి అమలులో ఉన్న క్రిమినల్ చట్టాలను ప్రక్షాళన చేస్తూ వాటి స్థానంలో మూడు కొత్త చట్టాలను తెస్తూ కేంద్రం ఆగస్టు 11న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది.
ఆ క్రమంలో రాజద్రోహ చట్టంలోని 124ఏ సెక్షన్ను సవాల్ చేస్తూ గతం లో దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం 12న విచారించనుంది. కాగా, ఐపీసీలోని 124ఏ సెక్షన్ పునః పరిశీల న ప్రక్రియను ప్రారంభించినట్టు కేం ద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెం కటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు.