న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జూలై 11వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. శివసేన చీఫ్ విప్ సునిల్ ప్రభు ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. సీఎంతో పాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పెండింగ్లో ఉందని, తక్షణమే ఈ పిటిషన్పై విచారణ చేపట్టాలని అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఆ కేసులో జూలై 11న విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది.